Templates by BIGtheme NET
Home >> Cinema News >> మెగాస్టార్ సినిమాలో వాళ్లిద్దరూ సెట్ అవుతారా..?

మెగాస్టార్ సినిమాలో వాళ్లిద్దరూ సెట్ అవుతారా..?

మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ‘తనిఒరువన్’ దర్శకుడు మోహన్ రాజా ఈ మెగా రీమేక్ కి దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై రామ్ చరణ్ – ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే మలయాళ ‘లూసిఫర్’ చిత్రంలో రెండు శక్తివంతమైన పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందులో హీరోకి సిస్టర్ రోల్ ఒకటి కాగా – మరొకటి హీరో చేసే పనులకు అండగా ఉండే ఒక షార్ప్ షూటర్ పాత్ర. మలయాళంలో మంజు వారియర్ – పృథ్వీరాజ్ ఈ పాత్రలు పోషించారు.

తెలుగు రీమేక్ లో ఈ పాత్రల్లో హీరోయిన్ ప్రియమణి – సత్యదేవ్ నటిస్తున్నారని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే మెగాస్టార్ సినిమాలో ఆయనకు ధీటుగా నిలబడే పాత్రల్లో వాళ్లిద్దరూ సెట్ అవుతారా అని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో వారిని తీసుకున్నారా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ‘లూసిఫర్’ ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మోహన్ రాజా చేసిన మార్పులు.. అలానే ఆయన స్క్రిప్ట్ నెరేట్ చేసిన విధానం నచ్చడంతో చిరంజీవి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share via
Copy link