Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇందుకే ప్రియుడికి నయన్ దూరం..న్యూస్ వైరల్

ఇందుకే ప్రియుడికి నయన్ దూరం..న్యూస్ వైరల్

తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుత ప్రేమ పక్షులు ఎవరంటే.. ‘నయన తార-విఘ్నేష్ శివన్’ అంటారు అందరూ. అంత గాఢంగా ప్రేమించుకుంటున్నారు వీరిద్దరూ. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. కానీ.. ఒకరినొకరు కలుసుకోవడం లేదట. దీంతో విషయం ఏమై ఉంటుందనే చర్చ నడుస్తోంది. నయనతార ప్రస్తుతం రజనీకాంత్తో కలిసి ‘అన్నాతే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో సీనియర్ నటి కుష్భూ కీర్తి సురేష్ ప్రకాశ్ రాజ్ మీనా తదితరులు పాల్గొంటున్నారు. ఇక విఘ్నేష్ శివన్ తన సొంత చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి సమంత అక్కినేనితో ‘కాథు వాకులా రెండు కధల్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగు కూడా హైదరాబాద్లోనే కొనసాగుతోంది.

కాగా.. ‘అన్నాతే’ సెట్లో కఠినమైన కొవిడ్ నిబంధనలు విధించారట. బయట నుంచి ఎవరూ సెట్లోకి రాకుండా.. అదేవిధంగా.. యూనిట్ సభ్యులు ఎవరూ బయటకు వెళ్లకుండా రూల్స్ పెట్టినట్టు సమాచారం. రజనీకాంత్ లాంటి ప్రముఖ నటీనటులు సెట్స్ లో ఉన్నందున అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారని సమాచారం. యూనిట్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా మొత్తం సిబ్బందికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదట.

లవ్ బర్డ్స్ గా ఉన్న.. నయనతార-విఘ్నేష్ శివన్ లాక్ డౌన్ టైంలోనూ దగ్గరగానే ఉన్నట్టు సమాచారం. అలాంటిది వీరిద్దరూ ప్రస్తుతం ఒకేచోట ఉన్నప్పటికీ.. వారిద్దరూ కలుసుకోవడం లేదట. దీనికి కారణం.. రెండు షూటింగులకు సంబంధించిన నిర్వాహకులు కఠినమైన కొవిడ్ నిబంధనలు విధించడమే కారణం అనే టాక్ వినిపిస్తోంది.

Share via
Copy link