Templates by BIGtheme NET
Home >> Cinema News >> దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసిన ‘సర్కారు వారి పాట’ టీమ్..!

దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసిన ‘సర్కారు వారి పాట’ టీమ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న తాజా చిత్రం ”సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్నాయి. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ తో ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో అభిమానులు కాస్త నిరాశతో వున్నారు. జనవరి ఫస్ట్ వీక్ లో ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ రెగ్యులర్ షూటింగ్ జనవరి 25 నుంచి దుబాయ్ లో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.

నిజానికి విదేశాల్లో కరోనా మహమ్మారి కలవరపెడుతుండటంతో పారిన్ షెడ్యూల్ ని వాయిదా వేసుకుని.. హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఇప్పుడు మళ్లీ షూటింగ్ ప్లాన్స్ మార్చుకుని దుబాయ్ కి పయనమవుతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లో దాదాపు 20 రోజుల షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్తారని సమాచారం. కాగా బ్యాంక్ స్కాముల నేపథ్యంలో అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతోన్న ఆర్థిక నేరగాళ్లను టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉంటుందని టాక్. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మహేష్ నుంచి వస్తున్న ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Share via
Copy link