Templates by BIGtheme NET
Home >> Cinema News >> సాయిపల్లవి దెబ్బ.. పూజా రష్మిక అబ్బా..

సాయిపల్లవి దెబ్బ.. పూజా రష్మిక అబ్బా..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ ఎవరు అంటే.. ప్రముఖంగా వినిపించే పేర్లు రెండు. ఒకటి రశ్మిక రెండు పూజా హెగ్డే. ఇండస్ట్రీలో ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్లు వీరిద్దరే. అందుకే.. తెలుగులో స్టార్ హీరోల సినిమా ఏదైనా మొదలవుతుందంటే… కథానాయికలుగా రశ్మిక పూజా హెగ్డే పేర్లే మొదట వినిపిస్తాయి. వారి డేట్స్ అందుబాటులో లేవని తెలిసిన తర్వాతే.. వేరే హీరోయిన్ వేటలో పడుతున్నారు మూవీ మేకర్స్. అంతలా డిమాండ్ ఉంది వీరిద్దరికి. అయితే.. వీరికి ధీటుగా మరో హీరోయిన్ పోటీకి వస్తోంది. నిన్నామొన్నటి వరకూ వెనుకబడి ఉన్న ‘డ్యాన్స్ బేబీ’ సాయిపల్లవి.. ఒక్కసారిగా దూసుకెళ్తోంది. వాస్తవానికి గతంలోనూ సాయి పల్లవికి ఆఫర్లు వచ్చినప్పటికీ.. తన పాత్రకు కథలకు ప్రాధాన్యం ఇచ్చి నచ్చిన క్యారెక్టర్లనే పిక్ చేసుకుంది. అందుకే.. ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా ఆమె కెరీర్ స్లోగానే సాగింది.

కాగా.. ఇప్పుడు డబుల్ స్పీడ్ అందుకుంది ఈ అమ్మడు కెరీర్. నాగచైతన్యతో నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. ఇక రానాతో విరాటపర్వం నాని సరసన శ్యామ్ సింగ్ రాయ్ కృష్ణవంశీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. ఇవే కాకుండా.. పవన్-రానా మల్టీస్టారర్ ‘బిల్లా రంగా’లోనూ సాయిపల్లవే హీరోయిన్.

ఈ విధంగా.. ఇప్పుడు సాయి పల్లవి కిట్ లో ఒకే సారి ఐదు మూవీస్ వచ్చిపడ్డాయి. ఈ బ్యూటీ పాంచ్ పటాకా మోగిస్తుండడంతో.. స్టార్ హీరోయిన్లుగా ఉన్న రశ్మిక పూజా వైపు చూస్తున్నారు సినీ జనాలు. సాయి పల్లవి నటిస్తున్న ఐదు సినిమాల్లో ఏ రెండు సినిమాలు హిట్ అయినా.. ఈ భామకు మరిన్ని స్టార్ ఆఫర్లు రావడం ఖాయం. అదీగాక.. పూజాహెగ్డే రశ్మికతో పోలిస్తే సాయి పల్లవి పారితోషికం కూడా తక్కువే. సో.. ఇప్పుడు సాాయిపల్లవి నుంచి ఈ ఇద్దరు బ్యూటీస్ కాంపిటేషన్ ఫేస్ చేయబోతున్నాారన్నమాట. చూడాలి మరి.. ఏం జరుగుతుందో?

Share via
Copy link