Templates by BIGtheme NET
Home >> Cinema News >> శేఖర్ కమ్ముల నాకు దర్శకుడి కన్నా ఎక్కువ : సాయి పల్లవి

శేఖర్ కమ్ముల నాకు దర్శకుడి కన్నా ఎక్కువ : సాయి పల్లవి

సాయి పల్లవి ఎంతటి ప్రతిభావంతమైన నటి అన్నది అందరికీ తెలిసిందే. ఈ అమ్మడి నటనకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులూ ఫిదా అయిపోయారు. ఇక ఈ బ్యూటీ పాదం కదిపితే ఆ లెక్కే వేరు. సహజంగానే డ్యాన్సర్ అయిన సాయి పల్లవి.. సినిమాల్లో వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ ఈల వేసి గోల చేస్తుంటారు. ప్రస్తుతం ఆమె తాజా తమిళ సంకలన చిత్రం ‘పావా కధైగల్’ నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్.. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తనను మంచి నటిగా మలిచిన దర్శకుల గురించి చెప్పింది పల్లవి. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ దర్శకుడు వెట్రిమారన్ లపై ప్రశంసలు కురిపించింది. శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ.. “శేఖర్ గారు నాకు దర్శకుడి కంటే ఎక్కువ. నేను ప్రస్తుతం జీవితాన్ని చూసే విధానాన్ని ఆయనే నాకు నేర్పించారు. ఇప్పుడు నాకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. నేను తేలిగ్గా వాటి నుండి బయటపడతాను. ఈ పోరాటం నాకు శేఖర్ కమ్ముల నేర్పించారు.” అని చెప్పింది ఈ ఫిదా బ్యూటీ.

వెట్రిమారన్ గురించి మాట్లాడుతూ.. అతను చాలా కూల్ అని చెప్పింది. తనతో పనిచేసిన మొదటి రోజు సెట్స్లో భయపడ్డానని ఆ తర్వాత ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పింది సాాయి పల్లవి. “వెట్రీ సార్ తనకు ఏమి కావాలో చెప్పరు అక్కడ జరగబోతున్న సీన్ వివరించి మీకు నచ్చినట్లు చేయండి అని చెపుతారు” అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఈ విధంగా వీరిద్దరి నుంచి తాను చాలా నేర్చుకున్నానంది.

కాగా.. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యకు జోడీగా నటిస్తోంది. నాగ చైతన్య సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఫీల్ గుడ్ మూవీలలో తనకు తానే సాటి అని ‘ఫిదా’తో మరోసాారి నిరూపించుకున్నాడు శేఖర్ కమ్ముల. మరి వీరికలయికలో రాబోతున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్నిస్తుండో చూడాలి.

Share via
Copy link