అవును.. దర్శకుడు పూరి జగన్నాథ్ ని చంపేస్తానని ఆర్జీవీ మదర్ వార్నింగ్ ఇచ్చారు. ఇది నిజమే. అయితే చంపాలని అనుకునేంత తప్పు పూరి ఏం చేశారు? అంటే.. తన కొడుకు అయిన ఆర్జీవీ ఇంటికి రాగానే లగేజ్ బ్యాగ్ లు అక్కడ పారేసి పూరి కేవ్ కి వెళ్లిపోతున్నాడట. అది తనకు నచ్చడం లేదని అసలు ఆర్జీవీ తనకు సమయం ఇవ్వడని వాపోయారు.
తన ప్రియాతి ప్రియమైన కొడుకుతో విలువైన సమయం కోల్పోవాల్సి వస్తోందన్నది ఆమె ఆవేదన. ఆర్జీవీ హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా పూరి వద్దకు వెళ్లిపోతాడట. దీనిని సహించలేని RGV తల్లి చాలా బాధపడ్డారు. అందుకే పూరీని చంపాలనుకుంటున్నారట.
RGV తో మాట్లాడాలనుకుంటే ఆమెకు అస్సలు సమయం ఇవ్వడు. ఇంట్లో బ్యాగులు వేసిన వెంటనే అతను పూరి జగన్నాధ్ గుహకు వెళ్లిపోతాడు. ఇక పూరి తనకు వ్యక్తిగతంగా నచ్చే బాలకృష్ణ ముక్కుసూటితనంపై పొగిడేస్తుంటారట. పూరీ తనతో మళ్ళీ కలిసి పనిచేయాలని అనుకుంటున్న సంగతి తెలిసినదే.
బాలయ్య సమస్యాత్మకం అని చెప్పి భయపెట్టడానికి చూడడమే గాక.. బాలకృష్ణతో సినిమాలు చేయవద్దని చెప్పిన వ్యక్తులు ఉన్నారు. కానీ పూరి దీనిని అంగీకరించడు. బాలయ్యతో మరో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. అన్నట్టు పూరి వద్దకే ఆర్జీవీ ఎందుకని వెళుతున్నాడు? ఒకవేళ బాలయ్య బాబుకు స్క్రిప్టు ఐడియాలు ఇస్తున్నాడా ఏమిటీ? అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు.