Templates by BIGtheme NET
Home >> Cinema News >> రకుల్ కి కరోనా పాజిటివ్.. సన్నిహితులకు హెచ్చరిక!

రకుల్ కి కరోనా పాజిటివ్.. సన్నిహితులకు హెచ్చరిక!

సెలబ్రిటీల్ని వెంటాడి వేధిస్తోంది కరోనా మహమ్మారీ. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా భారిన పడి చికిత్సతో కోలుకున్నారు. ఇటీవలే బిగ్ బి అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి చికిత్సతో బయటపడ్డారు. ఇప్పుడు అందాల రకుల్ ప్రీత్ సింగ్ కి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ అందింది. ఆ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. కోవిడ్ పరీక్షల అనంతరం స్వీయనిర్భంధంలోకి వెళ్లానని రకుల్ తెలిపారు. నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ దయ చేసి పరీక్షించుకోవాలని అభ్యర్థించారు రకుల్.

ప్రస్తుతం రకుల్ `మేడే` అనే బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కోవిడ్ -19 కోసం పాజిటివ్ పరీక్షించగా మంగళవారం మధ్యాహ్నమే తనకు వైరస్ సోకిందని ప్రకటించారు. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. బాగా విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే షూట్ లో కి తిరిగి వస్తాను అని రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రకటనలో వెల్లడించారు. గత కొద్ది రోజులుగా తనను కలిసినవారంతా అప్రమత్తంగా ఉండాలని రకుల్ హెచ్చరించారు.

తన తదుపరి ప్రాజెక్ట్ మేడే షూటింగ్ ప్రారంభించే ముందు.. రకుల్ ప్రీత్ సింగ్ గత నెలలో మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసినదే. అక్కడ ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

కెరీర్ విషయానికొస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పరంగా ఫుల్ బిజీ. అజయ్ దేవ్గన్ దర్శకత్వం వహించి నిర్మించనున్న థ్రిల్లర్-డ్రామా మేడేలో రకుల్ ప్రీత్ సింగ్ పైలట్ పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రంలో జూలైలో వైరస్ బారిన పడిన బాలీవుడ్ వెటరన్ అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. కొన్ని వారాల తర్వాత బిగ్ బి కోలుకున్నారు. తదుపరి ఓ బార్డర్ లవ్ స్టోరీలో కనిపించనుంది. ఇందులో అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో జాన్ అబ్రహం – అదితీరావు హైదారీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ 2014 లో యారియన్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. సిద్దార్థ్ మల్హోత్రా- నీరజ్ పాండేలతో అయ్యారి ఫార్వాలేదనిపిస్తే…. అజయ్ దేవ్గన్ – టబులతో కలిసి డి డి ప్యార్ దే విజయం అందుకుంది. సిద్దార్థ్ మల్హోత్రా – తారా సుతారియాతో పాటు `మార్జావాన్`లో కూడా నటించింది. బాలీవుడ్ తో పాటు కన్నడ- తెలుగు- తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది.

Share via
Copy link