Templates by BIGtheme NET
Home >> Cinema News >> రజనీకాంత్ సంచలన నిర్ణయం.. కారణం వాళ్లే.. ఆందోళనలో ఫ్యాన్స్!

రజనీకాంత్ సంచలన నిర్ణయం.. కారణం వాళ్లే.. ఆందోళనలో ఫ్యాన్స్!

‘రజనీకాంత్..’ ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. అంతకు మించి! తన మెస్మరైజింగ్ నటనతో దేశంలో కోట్లాది అభిమానులను సంతం చేసుకున్న ఈ సూపర్ స్టార్.. తన క్రేజ్ను ఖండాలు దాటించారు. విదేశాల్లోనూ ఆయనకు అభిమాన సంఘాలు ఉన్నాయంటే.. రజనీ మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అభిమానులను అలరించేందుకు డెబ్బై ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే.. ఇటీవల పొలిటికల్ ఎంట్రీపై యూటర్న్ తీసుకొన్న రజనీకాంత్.. లేటెస్ట్ గా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

‘అన్నాతే’ షూట్ లో అస్వస్థత..
తన లెేటెస్ట్ మూవీ ‘అన్నాతే’ షూట్ కోసం కొన్ని రోజులు క్రితం హైదరాబాద్ వచ్చారు రజని. ఈ క్రమంలో షూటింగ్ లో పలువురికి కరోనా రావడం.. రజనీ కూడా అస్వస్థతకు గురవడం.. ఆస్పత్రిలో చికిత్స పొందడం తెలిసిందే. డిశ్చార్జ్ అయిన తర్వాత చెన్నై వెళ్లిన సూపర్ స్టార్.. తాను రాజకీయాల్లోకి రావట్లేదంటూ సంచలన ప్రకటన చేశారు. రేపో మాపో పార్టీ ప్రకటించబోతున్నారంటూ ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చారు. తమిళ రాజకీయ వర్గాలను కూడా ఈ ప్రకటన ఓ కుదుపు కుదిపింది. ఆ నిర్ణయానికి గల కారణాలను కూడా రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

సినిమాల విషయంలోనూ..
రాజకీయం రంగంలోకి రావట్లేదంటూ ప్రకటించిన సూపర్ స్టార్.. ఇప్పుడు సినిమాల విషయంలోనూ అదే వైఖరితో ఉన్నారా అనే సందేహం కలుగుతోంది రజనీ లేటెస్ట్ నిర్ణయం చూస్తుంటే! పొలిటికల్ ఎంట్రీకిి ఆయన చూపిన మేజర్ రీజన్ అనారోగ్యం. ఇప్పుడు ఇదే కారణంగా.. సినిమాలకు కూడా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట రజనీ! ఈ వార్త అభిమానులను మరింత కలవరానికి గురిచేస్తోంది.

ఫుల్ స్టాప్ కాదుగా..?
ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ బ్రేక్ కామా అవుతుందా? లేక ఫుల్ స్టాప్ అవుతుందా? అని టెన్షన్ పడుతున్నారు. వాస్తవానికి పరిస్థితులు కూడా అంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ప్రస్తుతం రజనీ వయసు 70 సంవత్సరాలు. ఈ వయసులో సహజంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఎటూ ఉంటాయి. అవి కాకుండా.. ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు రజనీ. హైదరాబాద్ లో అస్వస్థత సమయంలో బీపీలో హెచ్చు తగ్గులు వచ్చాయని కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అయింది కాబట్టి.. బీపీలో ఇలాంటి తేడా మంచిది కాదని రజనీకి సూచించారు వైద్యులు. కాబట్టి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ కారణంగానే రజనీ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

వాళ్ల ఒత్తిడిని తట్టుకోలేకనే..
ప్రస్తుతం డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు రజినీకాంత్. ఈ సినిమా షూటింగ్ను త్వరగా పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఆయన డిసైడ్ అయినట్టు సమాచారం. కుటుంబ సభ్యుల ఒత్తడి వల్లే రజనీ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి అమెరికా టూర్ వెళ్లబోతున్నారని తెలిసింది.

తర్వాత ఏంటీ..?
ప్రస్తుతం ఏడు పదుల వయసులో ఉన్న రజనీకి.. రోజులు గడుస్తున్న కొద్దీ వయసు మరింతగా మీదపడుతుంది. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు మరింతగా పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ మునపటిలా సినిమాలు చేయగలరా? అన్నది ప్రశ్న. ఈ కోణంలో ఆలోచించినప్పుడు.. రజనీ బ్రేక్ తాత్కాలికం అవుతుందా? శాశ్వతం అవుతుందా? అనే సందేహం కూడా ఉత్పన్నమవుతోంది. అభిమానులు మాత్రం తలైవా ఎప్పటిలాగానే సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు. మరి రజనీ ఏం చేస్తారు అన్నది చూడాలి.

Share via
Copy link