Templates by BIGtheme NET
Home >> Cinema News >> తమిళ మలయాళ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టిన బబ్లీ బ్యూటీ..!

తమిళ మలయాళ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టిన బబ్లీ బ్యూటీ..!

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ‘జిల్’ ‘జై లవకుశ’ ‘తొలిప్రేమ’ ‘శివమ్’ ‘బెంగాల్ టైగర్’ ‘సుప్రీమ్’ ‘హైపర్’ ‘రాజా ది గ్రేట్’ ‘టచ్ చేసి చూడు’ ‘శ్రీనివాస కల్యాణం’ వంటి వరుస సినిమాలు చేసింది. ఇక గతేడాది చివర్లో ‘వెంకీమామ’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది రాశీఖన్నా. అయితే ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చెందింది. దీంతో తెలుగులో అవకాశాలకు దూరం అయింది. అయితే ఇతర ఇండస్ట్రీల నుంచి ఆ ముద్దుగుమ్మకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

రాశీఖన్నా తమిళ్ లో మూడు సినిమాలు లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమాలో రాశీ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ‘అరన్మానై 3’ ‘మేథావి’ వంటి మరో రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక శాండిల్ వుడ్ నుంచి కూడా అమ్మడికి బాగానే ఆఫర్లు వస్తున్నాయట. అయితే రాశీ ఖన్నా తమిళ మలయాళ ఇండస్ట్రీలపై ఫోకస్ పెడుతూ కన్నడ ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తోందని సమాచారం. ప్రస్తుతానికి రాశీ చేతిలో ఒక్క తెలుగు సినిమా లేనప్పటికీ ఫొటో షూట్స్ తో ఇక్కడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలను అప్లోడ్ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరి త్వరలోనే ఈ బబ్లీ బ్యూటీకి తెలుగులో ఛాన్సెస్ వస్తాయేమో చూడాలి.

Share via
Copy link