Templates by BIGtheme NET
Home >> Cinema News >> డార్లింగ్ లైనప్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉందా..?

డార్లింగ్ లైనప్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉందా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణా మూవీస్ కలసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు ప్రభాస్. కాకపోతే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఇంకాస్త సమయం పట్టనుంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’ అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. ఇది ప్రభాస్ నటిస్తున్న డైరెక్ట్ బాలీవుడ్ సినిమా కావడం విశేషం. ఇవి ఎప్పుడు పూర్తి చేస్తాడో అని అందరూ ఆలోచిస్తుంటే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించి ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ అనే మూవీ ప్రకటించాడు.

ఇదిలావుండగా ‘డార్లింగ్’ ప్రభాస్ లైనప్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రభాస్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడని తెలుస్తోంది. నిజానికి మైత్రీ నిర్మాతలు ఎప్పుడో ప్రభాస్ తో సినిమా ఉంటుందని వెల్లడించారు. కానీ అదే సమయంలో వేరే కథలు నచ్చడంతో వాటికి డేట్స్ ఇస్తూ వచ్చాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం సైన్ చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత కచ్చితంగా మైత్రీ మూవీస్ బ్యానర్ లో సినిమా చేస్తానని ప్రభాస్ వారికి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీని కోసం పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టు స్టోరీ మరియు డైరెక్టర్ ని సెట్ చేయమని సూచించాడట. వీలైనంత వరకు బాలీవుడ్ డైరెక్టర్ ని చూడమని ప్రభాస్ నిర్మాతలని అడుగుతున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ప్రభాస్ లైనప్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేరనుంది.

Share via
Copy link