పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత నటించబోతున్న సినిమా విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. చాలా రోజుల క్రితమే పవన్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. కాని మద్యలో మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇటీవలే రానాతో పవన్ మూవీ అంటూ ఆ రీమేక్ అధికారిక ప్రకటన వచ్చింది. షూటింగ్ జనవరిలోనే అనే పుకార్లు షికార్లు చేశాయి. దాంతో క్రిష్ మూవీ పరిస్థితి ఏంటా అంటూ అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి షూటింగ్ ను ప్రారంభించారు.
ఈ సినిమాను ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ లో పవన్ కూడా జాయిన్ అవుతున్నాడు. నిన్న పవన్ లేకుండానే కొన్ని షాట్స్ ను తీసిన దర్శకుడు క్రిష్ నేటి నుండి పవన్ హాజరు కాబోతున్న నేపథ్యంలో అసలు సినిమాను నేటి నుండి ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ ను ఒక దొంగగా క్రిష్ చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమా కథ మొఘలాయిల కాలం నాటిదిగా చెబుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి సినిమాలను మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తక్కువ సమయంలో క్రిష్ చేయగలడు. కనుక ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కు మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. విరూపాక్ష తో పాటు చాలా టైటిల్స్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. షూటింగ్ ప్రారంభం అయ్యింది కనుక త్వరలోనే సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.