Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘రేడియేషన్’ ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా..?

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘రేడియేషన్’ ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషనల్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చెప్పుకున్నారు. నిజానికి ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పటికే తారక్ కి ఓ స్టోరీ లైన్ కూడా వినిపించారు. దీనికి తగ్గట్టే ‘త్వరలో రేడియేషన్ సూట్ లో కలవబోతున్నాం’ అంటూ ప్రశాంత్ నీల్ – మైత్రీ వారు చేసిన ట్వీట్స్ వీరి కాంబోలో ప్రాజెక్ట్ ని కంఫర్మ్ చేసాయి. దీంతో త్వరలోనే తారక్ – ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అనౌన్సమెంట్ ఉంటుందని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం ‘కేజేఎఫ్ 2’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్.. సడన్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసే అందరిని షాక్ కి గురి చేశాడు.

‘సలార్’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగందూర్ నిర్మిస్తున్నారని వెల్లడిస్తూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు ప్రశాంత్. ఈ చిత్రాన్ని 2021 జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లి అదే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఏమైనట్లు అని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. అసలు ఈ సినిమా ఉన్నట్టా లేనట్టా అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. దర్శక నిర్మాతలు దీనిపై ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. నిజానికి తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా పూర్తి చేయడానికి కాస్త సమయం పట్టనుంది. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. సినిమా రిలీజ్ చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోపు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాని కంప్లీట్ చేసి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై వర్క్ స్టార్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే దీనిపై ప్రశాంత్ నీల్ – మైత్రీ మూవీ మేకర్స్ నుంచి స్పష్టత రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Share via
Copy link