Templates by BIGtheme NET
Home >> Cinema News >> కాలి నడకన తిరుపతి కొండెక్కిన హీరో.. సెల్ఫీ కోసం అభిమానుల పోటీ

కాలి నడకన తిరుపతి కొండెక్కిన హీరో.. సెల్ఫీ కోసం అభిమానుల పోటీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కాలి నడకన ఏడుకొండలు ఎక్కాడు హీరో నితిన్. భార్య షాలినితో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. అయితే.. కాలి నడకన మాత్రం నితిన్ ఒక్కరే వెళ్లారు. ఆయన భార్య షాలిని కారులో కొండపైకి చేరుకున్నారు. కాగా.. నితిన్ కాలి నడకన వస్తుండటం చూసి ఆశ్చర్యపోయిన కొంత మంది భక్తులు ఆయనతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. నితిన్ వేగంగా నడుచుకుంటూ వెళ్తుండగానే.. అభిమానులు ముందుకు వెళ్లి సెల్ఫోన్లతో సెల్ఫీలు దిగారు. గురువారం తెల్లవారు జామున వీవీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నితిన్ దంపతులు స్వామి వారిని దర్శించుకోనున్నారు.

కాగా.. నితిన్ కాలి నడకన తిరుమల వెళ్తున్న వీడియోను ఒక అభిమాని ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ వీడియోను రీట్వీట్ చేసిన నితిన్.. ‘‘ఓం నమో వెంకటేశాయ’’ అని రాశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. నితిన్ లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ విడుదలకు సిద్ధమవుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతో పాటు ‘చెక్’ ‘అంధాదున్’ రీమేక్తోనూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు నితిన్.

Share via
Copy link