Templates by BIGtheme NET
Home >> Cinema News >> మార్చి 11న నవ్విస్తామన్న ‘జాతి రత్నాలు’

మార్చి 11న నవ్విస్తామన్న ‘జాతి రత్నాలు’

ఏజెంట్ ఆత్రేయ నవీన్ పాలిషెట్టి నటిస్తున్న తాజా చిత్రం `జాతి రత్నాలు`. ప్రియదర్శి పులికొండ- రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ కె వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్వప్న సినిమా(మహానటి నిర్మాతలు) పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. జాతి రత్నాలు త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

జోగిపేట శ్రీకాంత్ గా మొదటి జాతి రత్నం నవీన్ పోలిషెట్టిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఫన్ తో మరిపించిన సంగతి తెలిసినదే. జాతిరత్నం జైలు జీవితం ఆద్యంతం ఫన్నీ. నవీన్ పోలిషెట్టి ఈ చిత్రంలో ఖైదీ కం మిస్టరీ మ్యాన్ గా కనిపించారు.

తాజాగా మరో ఆసక్తికర గ్లింప్స్ ని రిలీజ్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంట్లో కాదు థియేటర్స్ లో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం అంటూ ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఇక థియేటర్లలోకి వస్తుందని చెబుతారు.. కానీ రిలీజ్ చేయరు .. మేం అలా కాదు! అంటూ సెటైర్ వేసిన తీరు ఆసక్తిని కలిగించింది. మొదలెట్టాక వారసుడు పుట్టాల్సిన పని లేకుండానే రిలీజ్ చేస్తున్నామని టీమ్ ధీమాగా ప్రకటించడంలో వ్యంగ్యం నవ్విస్తుంది.

మహా శివరాత్రి కానుకగా `జాతి రత్నలు` మార్చి 11న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొదటి సింగిల్ చిట్టి లిరికల్ వీడియో ఆకట్టుకుంది. సిద్దం మనోహర్ ఛాయాగ్రాహణం అందిస్తుండగా.. అభినవ్ రెడ్డి దండా ఎడిటింగ్ చేస్తున్నారు. మురళి శర్మ- నరేష్ వికె – బ్రహ్మజీ- తనికెళ్ల భరణి- వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.

Share via
Copy link