Templates by BIGtheme NET
Home >> Cinema News >> భర్తతో విడిపోయాను.. నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ : శ్వేతా బసు ప్రసాద్

భర్తతో విడిపోయాను.. నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ : శ్వేతా బసు ప్రసాద్

‘శ్వేతా బసు ప్రసాద్..’ కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే.. ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు. అదే సమయంలో శ్వేతను పలు వివాదాలు చుట్టూ ముట్టాయి. దీంతో ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంది.

ఆ తర్వాత 2018 డిసెంబర్ 13న ఆమె వైవాహిక జీవితంలోకి వెళ్లింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ను శ్వేతా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లైయినా సంవత్సరంలోగానే.. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా.. ఈ విషయంపై స్పందించింది శ్వేత. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని అన్నారు. అంతేకాదు.. దానికి విడాకులు అని పేరు పెట్టాల్సిన పనిలేదని ఒక బ్రేకప్లా జరిగిందని చెప్పారు శ్వేతాబసు.

‘‘పెళ్లయిన పదేళ్ల తర్వాత.. అంతకంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా చాలా మంది దంపతులు విడిపోవడం చూస్తుంటాం. కానీ మేమిద్దరం మాత్రం ఏడాదిలోపే మా బంధానికి ముగింపు పలికాం. కాబట్టి దీన్ని విడాకులు అని పెద్ద పదంతో పోల్చడం కంటే.. బ్రేకప్ అనడం కరెక్ట్ అనిపిస్తుంది.’’ అని చెప్పుకొచ్చింది శ్వేత.

‘‘ఆ సమయంలో నాకు నా కుటుంబం స్నేహితులు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు నాకు నేనే ఓ మంచి స్నేహితురాలిగా మరాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది’’ అని శ్వేతాబసు ట్వీట్ చేసింది. కాగా.. 2019లో తన భర్త రోహిత్ నుంచి విడిపోతున్నట్లు శ్వేతా ఇన్స్టాగ్రామ్లో వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా.. 2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపిని విషయం తెలిసిందే. తర్వాత ఆమె ఆ కేసులో నిర్దోషి అని తేలింది. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు జీవితం పూర్తిగా మారిపోయింది. కొంతకాలం పాటు ఆమె సినిమాలకు దూరమయ్యారు. తాజాగా.. ఈ ట్వీట్ చేశారు.

Share via
Copy link