Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవర్ స్టార్ న్యూ లుక్కుతో ఫ్యాన్స్ ఖుషి అయినట్లేనా..??

పవర్ స్టార్ న్యూ లుక్కుతో ఫ్యాన్స్ ఖుషి అయినట్లేనా..??

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ లాయర్ పాత్రతో మళ్లీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. రోజురోజుకి భారీ అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ నివేత థామస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అవుతుండగా.. ఈ సినిమాలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ నుండి పవర్ స్టార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు.

అయితే రాజకీయాల తర్వాత పవన్ లుక్ గురించి ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. కరోనా వలన సినిమా షూటింగ్ లో గ్యాప్ రావడంతో ఆయన లుక్ ఏమైనా మారిపోయిందేమో అని అనుకున్నారట. కానీ మధ్యలో మెట్రో ట్రైన్ లో కనిపించిన లుక్ చూసి సంబరపడి పోతున్నారట. రాజకీయాలలో ఎలా ఉన్నా సినిమా సంగతికి వచ్చేసరికి ఖచ్చితంగా మంచి హీరోయిక్ లుక్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు. ఇక ఇప్పుడు పోస్టర్ లుక్ చూసి ఖుషి అవుతున్నారు. కోలీవుడ్ లోను అజిత్ హీరోగా ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం చివరిదశలో ఉన్న ఈ సినిమా కోర్టు సన్నివేశాలలో పవన్ విశ్వరూపం చూడబోతున్నారని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి పవన్ వకీల్ సాబ్ గా అలరిస్తాడేమో..!!

Share via
Copy link