Templates by BIGtheme NET
Home >> Cinema News >> కరోనా సెకండ్ వేవ్ ఆందోళనతో రేపు విడుదల అవ్వాల్సిన సినిమా వాయిదా..!

కరోనా సెకండ్ వేవ్ ఆందోళనతో రేపు విడుదల అవ్వాల్సిన సినిమా వాయిదా..!

కోవిడ్-19 ప్రభావం వల్ల కొన్ని నెలల పాటు థియేటర్స్ మూతబడిపోయి ఉన్నాయి. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ మల్టీప్లెక్సెస్ తెరుచుకోడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో పలు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి సినిమాలు విడుదల చేయాలని మేకర్స్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించుకున్నారు. దీనికి తగ్గట్టు కొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ డేట్స్ ని కూడా ప్రకటించారు. వాటిలో వైభవ్ హీరోగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘కట్టేరి’ సినిమా ఒకటి. రేపు థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేస్తుందనుకుంటుండగా సడన్ గా ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టుట్లు ప్రెష్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా నెలకొనియున్న ఆందోళనలతో సినిమాని విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

“కరోనా సెకండ్ వేవ్ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకొని.. ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితిలో ముందస్తు చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రొడక్షన్ హౌస్ కి ఉంది. వందలాది మంది సాంకేతిక నిపుణులు మరియు కళాకారుల కృషిని పరిగణనలోకి తీసుకొని ‘కట్టేరి’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము. అయితే పరిస్థితులు మెరుగైన తర్వాత విడుదల తేదీని ప్రకటించాలని ఎదురుచూస్తున్నాం” అని జ్ఞానవేల్ రాజా నేతృత్వంలోని స్టూడియో గ్రీన్ వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ అడ్వెంచర్ హారర్ కామెడీ చిత్రాన్ని ఎట్టకేలకు డిసెంబర్ 25న విడుదల చేయడానికి అన్ని ప్లాన్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త రకం కరోనా ప్రభావంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. అయితే ఇక్కడ టాలీవుడ్ లో మాత్రం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని రేపు డిసెంబర్ 25న రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. మరో రాబోయే రోజుల్లో కరోనా స్ట్రెయిన్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.

Share via
Copy link