2020 సంక్రాంతి కానుకగా రిలీజైన `అల వైకుంఠపురములో` సెన్సేషనల్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో నాన్ బాహుబలి రికార్డుల్ని తిరగరాసిన చిత్రంగా రికార్డులకెక్కడమే గాక.. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది.
ఈ సినిమా త్రివిక్రమ్ కి .. పూజా హెగ్డే.. నివేధ థామస్ వంటి వారికి పెద్ద బ్రేకింగ్ పాయింట్. వీటన్నిటినీ మించి ఎస్.ఎస్.థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా మరో పది మెట్లు ఎక్కించిన గ్రేట్ మూవీగా రికార్డులకెక్కింది. అల.. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాటలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. మిలియన్ల వీక్షణలను సాధించాయి.
2020 అల .. టీమ్ కి మరపురని సంవత్సరం. అందుకే మొదటి వార్షికోత్సవ వేడుకను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. సోమవారం రాత్రి హైదరాబాద్ లో రీయూనైట్ పార్టీ జరిగింది. నాయకానాయికలతో పాటు.. హాస్యనటుడు సునీల్- నవదీప్- సుశాంత్- సముదిరకని తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్.. ఎస్ రాధా కృష్ణ ఈ పార్టీలో కనిపించారు. థమన్ ఈ వేదిక వద్ద లైవ్ కాన్సెర్ట్ ని నిర్వహించగా అహూతులు పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.