Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేశారా..?

‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేశారా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. దీంతో దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ వీటిని రెట్టింపు చేసింది. హెంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకి కీలకమైన క్లైమాక్స్ ని ప్రశాంత్ నీల్ భారీగా తీసినట్లు తెలుస్తోంది. అధీరా – రాకీ భాయ్ కు మధ్య జరిగే భీకర పోరాట సన్నివేశం కోసం మేకర్స్ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశారని టాక్ నడుస్తోంది.

‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్ సన్నివేశం కోసం మేకర్స్ సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ హై లెవల్ లో షూట్ చేశారట. అలానే ఈ చిత్రం కోసం దాదాపు వంద కోట్లు బడ్జెట్ ఖర్చు అయ్యుండొచ్చని అనుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ – రవీనా టాండన్ తో పాటు ప్రకాష్ రాజ్ – రావు రమేష్ – ఈశ్వరీ రావు నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి రవి బాస్రుర్ సంగీతం అందిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. తెలుగులో ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని వారాహి చలన చిత్రం వారు విడుదల చేయనున్నారు.

Share via
Copy link