స్వరకర్త వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'బద్మాష్'.
నాగసిద్ధార్థ్, ఏక్తా జంటగా నటిస్తున్నారు. డా||జి.నాగయ్య నిర్మాత. ప్రస్తుతం గోవాలో నాయకానాయికలపై ఓ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. 'మకరీనా మకరీనా మనసాగనంది...' అంటూ సాగే ఈ పాటకు శేఖర్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. నేటి విద్యా వ్యవస్థ, విద్యార్థుల మనోభావాలు, కన్నవారి ఆకాంక్షలను రేఖామాత్రంగా స్పృశిస్తూ సాగే వినోదాత్మక చిత్రమిది. నిర్మాత మాట్లాడుతూ ''నవతరాన్నే కాదు పెద్దవాళ్లని సైతం ఒక్క క్షణం ఆలోచింపజేసేలా ఉంటుందీ కథ. ఇంజనీరింగ్ కళాశాల నేపథ్యంలో సాగుతుంది. విద్యార్థుల మనసు ఎప్పుడూ ఊగిసలాటలో ఉంటుంది. చిలిపితనం నిండి ఉండేవాళ్ల మదిలోని ఆలోచనల్నీ, ఆనందాల్నీ స్పష్టంగా చూపించే ప్రయత్నమిది. మరి 'బద్మాష్' అనే పేరు ఎందుకు పెట్టామో చిత్రం చూస్తే అర్థమవుతుంద''న్నారు. ''ఆద్యంతం వినోదాన్ని పంచేలా ఉంటుందీ ప్రేమ కథ. యువతనీ, పెద్దల్నీ సమంగా ఆకట్టుకొంటుంది. చక్కటి బాణీలు కుదిరాయి. మిగిలి ఉన్న రెండు గీతాల్నీ విదేశాల్లో చిత్రిస్తామ''న్నారు దర్శకుడు. వేసవిలో 'బద్మాష్'ని విడుదల చేస్తారు.| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- సింహా పాటలు విడుదల
- స్టార్ హీరో రవితేజ ఇక 'కత్తిలాంటోడు'
- వి.పి &పి.పి కి అల్లరి నరేష్ క్లాప్
- ‘మాయాబజార్’ విజయోత్సవ వేడుక!
- అల్లు అర్జున్ 'వధువు' అమృతసర్ అమ్మాయి..?!
Older news items:
- ప్రతిష్టాత్మక వాల్ట్ డిస్నీ తెలుగు సినిమా సిద్ధార్థతో..
- ‘సూపర్ కౌబాయ్’ ఆడియోను ఆవిష్కరించిన ‘సూపర్' హీరో
- 'చంద్రముఖి'తో 'లకలకలక' కు బాలయ్య సిద్ధం..??
- షూటింగ్ పూర్తి చేసుకున్న "కిల్లర్"
- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ చిత్రం





















