రాజా, సంచిత పదుకునె జంటగా శ్రీనివాస్ బళ్లాపురం దర్శకత్వంలో జయకృష్ణ క్రియేషన్స్
పతాకంపై సి.గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త రేబాల కిషోర్ కుమార్ రెడ్డి కెమేరా స్విచాన్ చేయగా జెవికె ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ క్లాప్ ఇచ్చారు. రంగారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... "రెండేళ్ల కిందట హైదరాబాదులో జరిగిన ఒక ఎన్నారై యువకుని ప్రేమకథే ఈ చిత్ర కథాంశం. ప్రస్తుత రోజుల్లో నవలా పఠనం తగ్గిపోయింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు చక్కటి నవల చదువుతున్న అనుభూతిని కలిగిస్తుంది. వెంగి విఠల్ చక్కటి సంగీతాన్ని అందించారు" అన్నారు.
నిర్మాత సి.గోపాలకృష్ణ మాట్లాడుతూ... మూడు షెడ్యూల్స్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 16 రోజులపాటు ఏకధాటిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంటుందని అన్నారు.
ఈ చిత్రంలో రాజ, సంచిత పదుకునెతోపాటు చలపతిరావు, ఏఆర్సీ బాబు, బాలయ్య, సుధ, సన, జెన్నీ, ఉత్తేజ్, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: వేటూరి, వెంగి, సంగీతం: వెంగి- విఠల్, నిర్మాత: సి. గోపాలకృష్ణ, కథ,మాటలు, స్క్రీన్ ప్లే: శ్రీనివాస్ బళ్లాపురం
| Comments |
|
Powered by !JoomlaComment 3.26














