దక్కన్ చార్జర్స్ సొంత గడ్డ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన మ్యాచులను ఇతర ప్రాంతాలకు మార్చాలని ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపియల్) నిర్ణయించింది.
తెలంగాణ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం లేకపోవడంతో ఐపియల్ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీన ప్రారంభ మ్యాచుతో పాటు ఐదు మ్యాచులు హైదరాబాదులో జరగాల్సి ఉండింది. అయితే వాటిని హైదరాబాదు నుంచి మార్చాలని ఐపియల్ నిర్ణయించింది.దక్కన్ చార్జర్స్ కు, కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మధ్య జరగాల్సిన మ్యాచు ముంబైలో జరుగుతుందని ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ ప్రకటించారు. మార్చి 19, 21, 29 తేదీల్లో హైదరాబాదులో జరగాల్సిన ఇతర మ్యాచులు నాగపూర్ లో జరుగుతాయని ఆయన చెప్పారు. ఏప్రిల్, 5, 10, 21 తేదీల్లో జరగాల్సిన మ్యాచులు ముంబైలో జరుగుతాయి. దీన్ని బట్టి విశాఖపట్నంలో జరగాల్సిన మ్యాచులు కూడా ముంబై తరలిపోయినట్లు అర్థమవుతోంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఆడుతా: యువరాజ్ సింగ్
- హాకీ ప్రపంచకప్లో టీమ్ ఇండియా అద్భుత ఆరంభం.
- హాకీ ప్రపంచ కప్తొలి రోజే ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ షాక్
- ప్రపంచకప్ హాకీలో స్పెయిన్ శుభారంభం
- 'లగ్జరీ' పదానికే లగ్జరీ అర్థాన్ని చెప్పగల కారు..!
Older news items:
- రవీంద్ర జడేజాపై ఏడాది పాటు నిషేధం
- బంతి ట్యాంపరింగ్: ఆఫ్రిదీ క్షమాపణ
- టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- మీర్పూర్ టెస్టు : సచిన్, ద్రావిడ్ సెంచరీలు
- ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సానియా అవుట్






















