నామినేషన్ దాఖలు సందర్భంగా సోనియాతో పాటు ఆమె కుమారుడు రాహుల్గాంధీ, అమేథీ మాజీ ఎంపీ కెప్టెన్ సతీష్ శర్మ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రాయ్బరేలీ స్థానం నుంచి మూడోసారి లోక్సభకు సోనియా పోటీ చేస్తున్న తరుణంలో ఆమె తన మద్దతుదారులతో కలిసి స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
అంతకుముందు సోనియా కుమారుడు రాహుల్ సైతం శనివారం అమేథీనుంచి లోక్సభ బరిలో దిగేందుకు వీలుగా తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26



















