తెలంగాణ పై కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ పట్ల ఆఖరి మోసంగా కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమం జోరును తగ్గించడానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం చూస్తోందని ఆయన విమర్శించారు. అంబేద్కర్ విద్యాసంస్థల రిలే నిరాహార దీక్షల ముగింపు సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. విద్యార్థుల బలిదానాలు ఎంత దాకా కొనసాగాలని, ఉద్యమాలు ఎన్నాళ్లు సాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తెలంగాణ సాధించే వరకు నిద్ర పోవద్దని, నిరంతరం పోరాటం సాగించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని, విశ్రమించకూడదని ఆయన అన్నారు. తెలంగాణ సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జెఎసి కవ్వీనర్ కోదండరామ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- డిఎస్ రాజీనామా చేయాల్సిందే: ఒయు జెఎసి
- శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ఇవి
- సీమాంధ్ర నేతలు ఊసరవెల్లులు: కెసిఆర్
- శ్రీకృష్ణ కమిటీ ఏం చేస్తుంది?
- కాకాపై మాట్లాడే స్థాయి కాదు: విహెచ్
Older news items:
- వైయస్సార్ హెలికాప్టర్ క్రాష్ పై నివేదిక
- టి.ఆర్.ఎస్.లో చేరమని పవన్ సూచించారా?
- ఎమ్మెల్యేగా వైయస్ విజయమ్మ ప్రమాణం
- రాష్ట్రంలో పెద్దలపై మావోయిస్టు గెరిల్లాల గురి?
- చిరుకు 'తమ్ముడు' దూరమే!






















