కేంద్రంలో అధికారం సాగిస్తున్న యూపీఏది అసమర్థ పాలన అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.
యూపీఏ అసమర్థ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. హాజీపూర్లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ బలహీన నేతల పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారంటూ పేర్కొన్నారు. పాకిస్థాన్తో సమస్యను పరిష్కరించడం సాధ్యంకాక అమెరికా సాయం కోసం పరుగులు తీస్తున్నారంటూ ఆయన యూపీఏ సర్కారుపై నిప్పులు చెరిగారు.
పాకిస్థాన్లోని సిక్కులు తాలిబన్లు చెరలో అష్టకష్టాలు పడుతుంటే కాపాడలేక పోతున్నారని, మన్మోహన్ సింగ్ బలహీనత వల్లే ఇదంతా జరుగుతోందంటూ ఆయన దుయ్యబట్టారు.
ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఓడితే జయప్రద ఆత్మహత్య: అమర్
- తమిళనాట "జయ"హో
- అఫ్జల్ ఉరితీతపై కాంగ్రెస్ రాజకీయం: మోడీ
- ఐదో దశ ఎన్నికలు: రేపటితో ప్రచారానికి తెర
- వీరప్ప మొయిలీని తొలగించలేదు: కాంగ్రెస్
Older news items:
- యూపీలో శాంతిభద్రతలు అస్తవ్యస్తం: వరుణ్ గాంధీ
- కాంగ్రెస్తో పొత్తుపై 16 తర్వాత నిర్ణయం: కారత్
- ఏకాభిప్రాయంతో ఈలం సమస్యకు పరిష్కారం: పీఎం
- మేఘాలయాలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
- తృతీయ కూటమిదే అధికారం: ప్రకాష్ కారత్






















