సభలో రాజకీయ నాయకుల పాత్ర లేదని విద్యార్థి నాయకులంటున్నారు. సభకు స్వామి అగ్నివేశ్, తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు వస్తారని వారు చెబుతున్నారు. శాంతియుతంగా తాము ఉద్యమాలు సాగిస్తున్నామని, అయినా పోలీసులు సభకు అనుమతి నిరాకరించడం సరైంది కాదని వారంటున్నారు. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభమైన విద్యార్థుల మహా పాదయాత్రలు 7వ తేదీ నాటికి కాకతీయ విశ్వవిద్యలయానికి చేరుకుంటాయి. ఈ సభకు రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కూడా మద్దతు తెలిపింది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26



















