భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ నివాసంలో చోరీ జరిగింది.
గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో దొంగలు వెనక నుంచి గోడ దూకి హైదరాబాద్ రాంనగర్ లో గల ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. ఆవరణలోని నాలుగు గ్యాస్ సిలిండర్లను వారు ఎత్తుకుపోయారు. దీనిపై ముషిరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది.దత్తాత్రేయది రెండంతస్థుల భవనం. దొంగలు ఆవరణలోకి చొరబడ్డారే తప్ప ఇంట్లోకి ప్రవేశించలేదని తెలుస్తోంది. బండారు దత్తాత్రేయ ఇంట్లో చోరీ జరగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పోలీసులు దత్తాత్రేయ ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్స్ ను కూడా రప్పించారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26



















