మహిళా బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) చిక్కుల్లో పడింది.
మహిళా బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు చేస్తామని పార్టీ లోకసభ సభ్యులు కొంత మంది హెచ్చరిస్తున్నారు. దీంతో విప్ జారీ చేసి వారిని నియంత్రించే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉంది. తిరుగుబాటు తలెత్తిన నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, బిజెపి మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
ఆ నేతలు గురువారం ఉదయం అసమ్మతివాదులైన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. లోకసభలో మహిళా బిల్లుపై వోటింగ్ కు తాము విప్ జారీ చేస్తామని సుష్మా స్వరాజ్ చెప్పారు. యోగి ఆదిత్యనాథ్, హుకుమ్ దేవ్ నారాయణ యాదవ్, రమేష్ బియాస్ వంటి లోకసభ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 116 మంది సభ్యులున్న బిజెపి మద్దతు బిల్లు ఆమోదం పొందడానికి ఎంతో కీలకం.
| Comments |
|
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
- త్రిసభ్య బెంచ్ కు ముస్లిం కోటా బిల్లు
- రాజ్యసభకు జావేద్ అక్తర్, మణిశంకర్
- గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి సమన్లు
- బుద్ధదేవ్ ను చంపే యోచన లేదు: దీపక్
- ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్
- వెనక్కి తగ్గిన లాలూ, ములాయం
- మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- మహిళా బిల్లుపై మమత అలక
- చర్చ లేకుండా మహిళా బిల్లుపై వోటింగ్
- రాజ్యసభ నుంచి 7గురు ఎంపీల సస్పెన్షన్






















